వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి బాపట్ల జిల్లా మేదరమెట్ల పర్యటనలో భాగంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యంతో పాటు, వయోభారంతో బాధపడుతున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
![]() |
![]() |