ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకి సులభంగా సేవలు అందించడానికే వాట్సప్ గవర్నెనెన్సు తెచ్చాము

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 03:50 PM

వాట్సప్‌ గవర్నెన్స్‌పై ఏపీ శానసనసభలో లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లారని.. చంద్రబాబు పౌరసేవలను ఈసేవగా మార్చి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లారని తెలిపారు. పాదయాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పూర్తిగా అర్ధం చేసుకున్నామన్నారు. ప్రభుత్వం నుంచి సేవలు అందుకోవాలంటే చేతులు కట్టుకుని నిల్చున్న పరిస్థితి ప్రజలదన్నారు. అందుకే సులభతరంగా పౌరసేవలు అందాలని సంకల్పించుకున్నామని చెప్పారు. మంగళగిరిలో ఓ ఎంపీపీ కుల ధృవీకరణ పత్రం అడిగితే గత ప్రభుత్వ హయాంలో వేధించారని.. అప్పుడే ప్రజలకు అత్యంత సులువుగా సర్టిఫికెట్లు జారీ చేసేలా వాట్సప్ గవర్నెనెన్సు తెచ్చామన్నారు. విజిబుల్ గవర్నెన్సు ఇన్విజిబుల్ గవర్నమెంట్ అనే అంశాన్ని బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ పౌరసేవల కోసం మళ్లీ ప్రత్యేకంగా మరో యాప్ కాకుండా అందరూ వినియోగించే వాట్సప్‌నే దీని కోసం వాడుకోవాలని భావించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa