ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 25న మరోసారి విచారణకి విజయసాయిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 03:52 PM

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు ఈ నెల 25వ తేదీన విజయసాయి రెడ్డి మళ్లీ విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. కాకినాడ సీ పోర్ట్, సెజ్ వ్యవహారంలో గత బుధవారం విచారణకు సీఐడీ అధికారులు పిలిచిన విషయం తెలిసిందే. విజయవాడ సీఐడీ కార్యాలయంలో 5 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. అవసరమైతే మళ్లీ రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. ఆ మేరకు విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మళ్లీ నోటీస్‌లు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa