ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెనుగంచిప్రోలు తిరుణాల గొడవపై హోంమంత్రి కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 03:53 PM

ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తిరుణాలలో జరిగిన గొడవపై హోంమంత్రి వంగలపూడి అనిత  సీరియస్ అయ్యారు.  పోలీసులపై రెచ్చిపోయి రాళ్లతో దాడిచేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ పాకెట్లు, బాటిళ్లు, రాళ్లు విసిరిన ఘటనలో పోలీసులకు, భక్తులకు గాయాలయ్యాయి. ఈ దాడి ఘటనకు కారణమైన వారందరిపై కేసులు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు హోంమంత్రి ఆదేశించారు. జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలవడంపై అతని పరిస్థితిపై ఆరా తీశారు. నందిగామ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించేలా చూడాలని ఆమె ఆదేశించారు. అదుపు చేసి రక్షించాలనుకున్న పోలీసులని చూడకుండా దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa