ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదరణ-3 పధకానికి శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 10:03 AM

కూటమి ప్రభుత్వం ఆదరణ పథకాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అవసర మైన వస్తువులను 90శాతం సబ్సిడీపై అందజేయనుంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభు త్వం అధికారంలో ఉన్న 1997-99 సంవత్సరంలో ఆదరణ-1, 2018-19లో ఆదరణ-2 ను అమలు చేసింది. 335 రకాల వృత్తిదారులకు వారికి అవసరమైన పరికరాలు అందజేసింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన అన్ని పథకాలను నిలిపేసింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ బీసీలకు మంచిరోజులు వచ్చాయి. ఆదరణ-3 పేరుతో కులవృత్తులతో జీవిస్తున్న వేలాది మంది బీసీలకు అవసరమైన వస్తువులను కొద్దిరోజుల్లోనే అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa