ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్గాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 09:35 AM

తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలంలో గల దూబచర్లగాంధీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఈ ఘటనపై ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో ఇవాళ(శనివారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష చేశారు. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించారు. భారతరత్న అంబేద్కర్‌ను అగౌరవపరిచేలా విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను సీఎం చంద్రబాబుకు డీజీపీ తెలిపారు. ఈ ఘటనలో కుట్ర కోణాన్ని వెలికి తీయాల్సిందిగా డీజీపీని ఆదేశించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు సీఎంకు డీజీపీ తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఎంకు వివరించారు. వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా కుట్ర చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు కోరారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే వారిపై నిఘా ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa