ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీలో చేరిన జైరమేష్, రవీంద్రబాబు కి బిగ్ షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 07:32 PM

వైసీపీలో చేరిన టీడీపీ నేతలకు.. జగన్మోహన్ రెడ్డి వరుస పెట్టి షాకులు ఇస్తున్నారు. విజయవాడ ఎంపీ టిక్కెట్ ఆశ పెట్టి… ఇరవై ఏళ్ల కిందనే టీడీపీ నుంచి దూరమై.. వ్యాపారాలు చేసుకుంటున్న… దాసరి జైరమేష్ పార్టీలో చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు వేరే అభ్యర్థిని వెదుక్కుంటున్నారు. తన అక్రమ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉండి.. కేసులు .. విచారణ కూడా ఎదుర్కొన్న పీవీపీ సంస్థల అధినేత పొట్లూరి వరప్రసాద్ ఇప్పుడు రేసులోకి వచ్చారు.
ఆయన జగన్మోహన్ రెడ్డితో టచ్‌లోకి వెళ్లి.. దాదాపుగా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటానని చెప్పడంతో… జగన్ మనసు మార్చుకున్నారు. ఇప్పుడు పీవీపీకి విజయవాడ లోక్‌సభ టిక్కెట్ ఖరారు చేయాలన్న ఆలోచన చేస్తున్నారు.మరో వైపు… అమలాపురం ఎంపీ.. పండుల రవీంద్రబాబుకి వైసీపీలో అసలు సీన్ తెలిసిపోయింది. తనకు లోక్‌సభ టిక్కెట్ కాకపోతే.. ఏదో ఒక అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామని ఆశ పెట్టి.. పార్టీలో చేర్చుకున్నారని.. ఇప్పుడు.. ఎక్కడా తన పేరు పరిశీలనలోకి తీసుకోవడం లేదని.. ఆయన మథన పడిపోతున్నారు. ఈ విషయాన్ని తన అనుచరులతో చెప్పి.. బాధ పడుతున్నారు. తాను టీడీపీలోకి వస్తానని… రాయబారాలు పంపుతున్నారు. తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రం… ఆయనకు ముందుగాే… తలుపులు మూసేశాయి. చెప్పినప్పుడు వింటే.. ఆయనకు కచ్చితంగా ఏదో ఒక అసెంబ్లీ టిక్కెట్ ఖరారు చేసేవారు.. వైసీపీలోకి వెళ్లి వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవి విమర్శలు చేసి.. ఇప్పుడు… పార్టీలోకి వస్తానంటే ఎట్లా అంటున్నారు.
అనంతి శ్రీనివాస్ పరిస్థితి కూడా అంతే ఉందంటున్నారు. తాను వైసీపీలో చేరడంతో… గొప్ప ఊపు వస్తుందని ఆయన అనుకున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలు కూడా.. ఇప్పుడు అవంతి వెంట లేరు. ఆయన కూడా… ఇప్పుడు.. అనవసరంగా పార్టీ మారానని సన్నిహితుల వద్ద బాధపడుతున్నారు. ఇప్పుడు భీమిలీలో ఆయన ఎదురీదుతున్నారు. పైగా.. లోకేష్, లక్ష్మినారాయణ వంటి పేర్లు తెరపైకి వస్తూండటంతో.. అసలు భవిష్యత్ లేకుండా పోయిందని ఆయన బాధపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa