ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోహ్లీ, ఆర్సీబీ ఫ్యాన్స్‌పై,,,గిల్ సంచలన పోస్ట్‌

sports |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 10:25 PM

ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌ను.. రెండో మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన ఆర్సీబీ.. మూడో మ్యాచులో అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఈ ఎడిషన్‌లో సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచులో ఆర్సీబీ పరాజయం పాలైంది. దీంతో తమ జట్టును ఉత్సాపరిచేందుకు స్టేడియానికి తరలివచ్చిన ఆర్సీబీ ఫ్యాన్స్.. నిరుత్సాహానికి గురయ్యారు.


అయితే చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీని ఓడించిన తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన ఓ పోస్టు చర్చనీయాంశంగా మారింది. గిల్ పోస్టు కొత్త వివాదానికి తెరలేపింది.


గిల్ పోస్టులో ఏముంది?


"మా దృష్టి మొత్తం ఆటపైనే ఉంది, అరిచి గోల చేయడంలో కాదు" అన అర్థం వచ్చేలా సోల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అతడు పెట్టిన పోస్టులో తొలి వాక్యంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ అరచిగోల చేయము.. అని అతడు క్యాప్షన్ ఇవ్వడంపై వివాదం చెలరేగింది.


విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్‌ను ఉద్దేశించే గిల్ ఈ పోస్టు పెట్టాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మ్యాచ్‌ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఇక్కడ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. దీంతో ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తారు. తమ అభిమాన జట్టుకు మద్దతుగా స్టేడియంలో గోలగోల చేశారు.


అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ ఔట్‌ అయినపుడు కోహ్లీ సంబురాలు చేసుకున్నాడు. ఆ సమయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ గట్టిగా అరిచారు. దీన్ని గుర్తుపెట్టుకునే గిల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని ప్రచారం జరుగుతోంది. విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్‌ను ఉద్దేశించే గిల్‌ పోస్టు పెట్టాడని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


అయితే మరికొందరు మాత్రం గిల్‌ తీరును తప్పుబడుతున్నారు. ఇలాంటి కామెంట్లు చేయడం ఎందుకు? ఎవరైనా నిన్ను హేళన చేశారా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క పోస్టుతో గిల్.. కొత్త వివాదానికి తెరలేపినట్లయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com