మంగళగిరి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు లోకేశ్ చెప్పారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు మంగళగిరి ప్రజలకు తాను ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఏప్రిల్ 13న వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి, వచ్చే ఏడాది సరిగ్గా అదే తేదీన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ‘ఎన్టీఆర్ సంజీవని’ పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్లు ఏర్పాటు చేసిన విషయం గుర్తుచేశారు. దుగ్గిరాలలో మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సతో పాటు మందులు అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో నీటి సమస్య ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని వివరించారు. నిరుపేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టుమిషన్లు అందజేసినట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
![]() |
![]() |