సింగపూర్లో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ మంగళవారం రాత్రి సింగపూర్ వెళ్లారు. నేరుగా శంకర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకున్నారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. తన కుమారుడికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని, చేతులు, కాళ్ళకు గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందించారని తెలిపారు. ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై డాక్టర్లు పరీక్షలు చేశారని తెలియచేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం శంకర్ను అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చినట్లు పవన్ తెలిపారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa