ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ మీద రాజకీయ యుద్ధం చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 01:51 PM

ఏపీ ప్రభుత్వంపై, పోలీసులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. జగన్‌ క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పుకపోతే జగన్‌పై యుద్ధం తప్పదంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తికి 1100 మంది పోలీసుల్ని కేటాయించారని.. హెలిప్యాడ్ వద్ద 200 మంది పోలీసులు ఉన్నా దూసుకొచ్చారన్నారు. పోలీసులపై రాళ్ల దాడి కూడా చేశారని తెలిపారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైకోయిజంతో ఉన్నారో తెలుస్తోందన్నారు. లింగమయ్య హత్య కేసులో నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేశారన్నారు. అదే విధంగా పోలీసులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. బీసీ పోలీస్ అధికారిపై దారుణ పదజాలం ఉపయోగించారని.. సుధాకర్ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వారంలోపు క్షమాపణ చెప్పకపోతే.. జగన్ మీద రాజకీయ యుద్ధం చేస్తామని హెచ్చరించారు. వీడియో కాల్స్ చేసినట్టు జగన్ దగ్గరున్న సాక్షాలేంటి అని ప్రశ్నించారు. బీసీలకు క్షమాపణ చెప్పకపోతే.. బీసీల ప్రతాపం చూపిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. లింగమయ్య కుటుంబానికి ఇప్పటి వరకు ఏం సాయం చేశావ్ అని నిలదీశారు. బీసీల మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటే ఎవరూ ఓర్వరన్నారు. జగన్ మైండ్ దొబ్బింది.. అతనింకా ఇంకా కోలుకోలేదంటూ కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa