తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మీ ఇంటికి ఎంత దూరమో.. మా ఇంటికి కూడా అంతే దూరం’ అంటూ మాట్లాడారు. రానున్న రోజుల్లో ‘మన ప్రభుత్వమే వస్తుంది’ అని.. అందరి లెక్కలు తేలుస్తాం అని వ్యాఖ్యలు చేశారు. ‘నేను పెద్దిరెడ్డి దగ్గరకు వెళ్లాను. కూటమి ప్రభుత్వం ఏం చేసినా కూడా దాన్ని దాటి ప్రజలు మనకు ఓటేస్తారని చెప్పాను. తెలుగుదేశం నాయకులు సైతం మాపై కక్ష పెట్టుకోవద్దు అని అంటున్నారు. అది మాత్రం జరగదు. గుంటూరు ఇవతల వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతారు. గుంటూరు అవతలి నుంచి నరికిపారేస్తారు. మనింటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమో వాళ్లింటికి మనిల్లు అంతే దూరం’ అంటూ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కారుమూరి చేసిన వ్యాఖ్యల వీడియోను టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. జగన్ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పినా, వైసీపీ నేతల్లో అధికార మదం ఇంకా దిగలేదని.. వారి నేర ప్రవృతికి ఇదే నిదర్శనమని టీడీపీ నేతలు అన్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రైతుల్ని ఎర్రిపప్పలు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన కారుమూరి ఎర్రిపప్ప అంటే బుజ్జికన్నా అని అర్థంగా చెప్పారు. దాంతో అందరూ ఆయనను ఎర్రిపప్పా అని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కాగా కారుమూరి నాగేశ్వరరావు చేసిన హెచ్చరికలపై టీడీపీ నేతలు మండి పడుతున్నారు. బహిరంగంగా చంపుతామని హెచ్చరిస్తున్న ఆయనపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలను రెచ్చగొట్టి.. హింస జరిగేలా చేసి..రాష్ట్రంలో పరిస్థితులు దిగజార్చేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే రాష్ట్రం గాడిన పడుతోందని.. పెట్టుబడులు వస్తున్నాయని ఇలాంటి సమయంలో అధికార పార్టీ నేతల్ని ఇలా హెచ్చరించడం ద్వారా వారిలో ఎవరైనా ఆవేశంగా ఏదైనా చేస్తే.. వెంటనే దాన్ని జాతీయ స్తాయి ఇష్యూగా చేసి.. రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవని ప్రచారం చేసేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ నేతలు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa