ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్

national |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 03:33 PM

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ గవాయ్ బాధ్యతలు స్వీకరించి ఈ ఏడాది నవంబర్ 24 వరకు సీజేఐగా కొనసాగనున్నారు.జస్టిస్ సంజీవ్ ఖన్నా 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని తన న్యాయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తొలుత తీస్ హజారీ కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 2004లో ఇన్‌కమ్ టాక్స్ విభాగానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. అలాగే ఢిల్లీ హైకోర్టులో ఎమికస్ క్యూరీగా (కోర్టుకు సలహాలు ఇచ్చే న్యాయ నిపుణుడు) మరియు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa