ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చున్నీతో భర్తను ఉరేసి చంపి.. కాల్వలో పడేసిన యూట్యూబర్

Crime |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 11:17 PM

యూపీలోని మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత ఓ వ్యక్తి తనకు అలాంి పరిస్థి రాకూడదని తన భార్యకు.. ప్రియుడితో పెళ్లి చేశాడు. తాజాగా, అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో వీడియోలు, రీల్స్ చేస్తోన్న ఓ వివాహిత.. అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ప్రియుడితో ఉండగా భర్తకు దొరికిపోయి.. దారుణానికి ఒడిగట్టింది. భర్తను ఉరేసి హత్యచేసి.. ప్రియుడితో కలిసి శవాన్ని కాల్వలో పడేసింది. దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన హర్యానాలోని హిసార్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హిసార్‌లోని ప్రేమనగర్‌కు చెందిన ప్రవీణ్ (35), రవీనా (32) భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల బాబు ఉన్నాడు. రవీనాకు సురేష్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఈ పరిచయంతో ఇద్దరూ షార్ట్ వీడియోలు తీయడం మొదలుపెట్టారు. దీనికి భర్త ప్రవీణ్, అతడి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అయినాసరే ఏడాదిన్నర నుంచి వీడియోలు చేస్తూ.. సోషల్ మీడియాలో పెడుతున్నారు.


డాన్స్ రీల్స్‌ ద్వారా రవీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 34,000 మందికి పైగా ఫాలోవర్లు వచ్చారు. యూట్యూబ్‌లో కూడా ఇతరులతో కలిసి వీడియో సిరీస్‌లు చేస్తోంది. కుటుంబ సభ్యుల అభ్యంతరాలను పట్టించుకోకుండా.. భర్తతో గొడవలు పడుతూ కూడా వీడియోలు చేస్తూనే ఉంది. అయితే, ప్రవీణ్‌తో సాన్నిహిత్యం పెరిగి.. అక్రమ సంబంధానికి దారితీసింది.


ఈ క్రమంలో మార్చి 25న సురేశ్‌తో అభ్యంతరకరమైన స్థితిలో ఉండగా ప్రవీణ చూసి భార్యను నిలదీశాడు. దాంతో రవీనా, సురేష్ కలిసి డుపట్టా‌తో అతడి గొంతుకు ఉరేసి హత్య చేశారు. ప్రవీణ్ ఎక్కడున్నాడని కుటుంబ సభ్యులు అడిగితే తనకు తెలియదని అబద్దం చెప్పింది. అదే రోజు రాత్రి 2:30 గంటల సమయంలో, ప్రవీణ్ మృతదేహాన్ని ప్రియుడి సాయంతో బైక్‌పై ఎక్కించుకుని వెళ్లి, ఇంటి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిన్నోడ్ రోడ్ కాలువలో పడేసింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మార్చి 28న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ప్రవీణ్ మృతదేహం పోలీసులకు కనిపించింది.


రవీనాను అనుమానించిన పోలీసులు.. ఇంటి వైపు వెళ్లే రోడ్లపై ఉన్న సీసీటీవీ వీడియోలను పరిశీలించారు. బైక్‌పై ఉన్న వ్యక్తి మధ్యలో మృతదేహం ఉన్నట్టు కనిపించింది. రవీనా ముసుగు ధరించి వెనుక కూర్చొని ఉంది. రెండు గంటల తర్వాత అదే బైక్‌పై ఆమె తిరిగి ఇంటికి వచ్చినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. దీంతో రవీనా, ఆమె ప్రియుడు సురేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కుమారుడు తాత సుభాష్ సంరక్షణలో ఉన్నాడు.


ఈ ఘటనకు నెలరోజుల ముందే, ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్‌ను.. భార్య రస్తోగి ప్రియుడితో కలిసి హత్య చేసి, అతడి శరీరాన్ని ముక్కలు చేసి, డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనతో భయపడిపోయిన ఓ వ్యక్తి తన భార్యను ఆమె ప్రేమికుడికి ఇచ్చిన పెళ్లి చేసిన ఘటన కూడా వార్తల్లో నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa