ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్‌ఎస్‌జీలో చేరిన మయాంక్ యాదవ్,,,రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ ఆడే అవకాశం

sports |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 11:23 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి మూడు మ్యాచ్‌లలో రెండింట్లో ఓడి.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి గాడిలో పడ్డట్లే కనిపించింది. కానీ తాజా మ్యాచ్‌లో ఓడి.. ఏడు మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో ఉంది. ఆ జట్టు ఏప్రిల్ 19న తమ తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆ జట్టుకు గుడ్‌న్యూస్ అందింది.


గాయంతో తాజా ఎడిషన్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడని.. మయాంక్ యాదవ్.. తిరిగి జట్టులోకి చేరాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కొన్ని నెలల నుంచి ఉన్న అతడు.. తాజాగా ఫిట్‌నెస్ సాధించి.. ఐపీఎల్‌ ఆడేందుకు వచ్చాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రూ. 11 కోట్లు వెచ్చించి మరీ మయాంక్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకుంది. కానీ వెన్ను గాయం కారణంగా ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో అతడు ఆడే అవకాశం ఉంది.


నిజానికి మయాంక్ యాదవ్ కెరీర్ ప్రారంభం నుంచి గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. గత సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్.. గంటకు సగటున 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌తో మయాంక్ యాదవ్.. అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో 3 మ్యాచ్‌లలో అతడు 4 వికెట్లు పడగొట్టాడు. మరి ఈ సీజన్‌లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో తేలాల్సి ఉంది.


రిషభ్ పంత్ (కెప్టెన్), నికోలస్ పూరన్‌, రవి బిష్ణోయ్‌, మయాంక్ యాదవ్‌, మోసిన్ ఖాన్‌, ఆయుష్‌ బదోనీ, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, అవేశ్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాశ్ దీప్, ఎం.సిద్దార్థ్, దిగ్వేశ్ సింగ్, షహబాజ్ అహ్మద్, ఆకాశ్ సింగ్, షమర్ జోసెఫ్‌, ప్రిన్స్ యాదవ్, యువరాజ్ చౌదరి, హిమ్మత్ సింగ్, రాజ్యవర్ధన్ హంగార్‌గేకర్, అర్షిన్ కులకర్ణి, మ్యాథ్యూ బ్రీట్జికీ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa