లిక్కర్ స్కాం కేసులో బాగంగా సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరయ్యారు. వేల కోట్ల మద్యం కుంభకోణం దర్యాప్తు వేగాన్ని సెట్ మరింత పెంచింది. కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తునే వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి , మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ని ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆ ఇద్దరికి మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. అయితే ఒక రోజు ముందే గురువారం వస్తానని చెప్పిన విజయసాయి కోసం సెట్ అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎదురు చూశారు. చివరి నిముషంలో విజయసాయి నుంచి మెసేజ్ వచ్చింది. ముఖ్యమైన పనులు ఉండం వల్ల రాలేకపోతున్నానని, శుక్రవారం తప్పకుండా హాజరవుతానని చెప్పారు. దీంతో ఇవాళ విజయసాయిని ప్రశ్నించనున్నారు. కాగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విజయవాడకు శుక్రవారం ఉదయమే చేరుకున్నారు. మరి కాసేపట్లో మద్యం కుంభకోణంపై జరిగే విచారణకు హాజరు కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa