ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.2000 దాటితే యూపీఐ పేమెంట్లపై జీఎస్‌టీ.. కేంద్రం క్లారిటీ!

business |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 10:41 PM

దేశీయ డిజిటల్ చెల్లింపుల విధానంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఒక సంచలనాత్మక మార్పు. డిజిటల్ పేమెంట్లలో యూపీఐదే అగ్రస్థానం. నిత్యం కోట్లలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఎలాంటి ఛార్జీలు లేకుండా చిన్న పేమెంట్లు సైతం ఈజీగా చేసే సౌకర్యం యూపీఐ ద్వారా అందుతోంది. దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్ పే, ఫోన్ పే , పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ఉపయోగిస్తున్నారు. కూరగాయల నుంచి పెద్ద పెద్ద వస్తువుల కొనుగోళ్ల వరకు ఫోన్ ద్వారానే యూపీఐ పేమెంట్లు చేస్తున్నారు. అయితే, యూపీఐ పేమెంట్లపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.


రూ.2000 ఆపైన జరిపే యూపీఐ పేమెంట్లపై జీఎస్‌టీ వేయనున్నారన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. యూపీఐ పేమెంట్లపై జీఎస్‌టీ అంటూ కొన్ని వెబ్‌సైట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం జరుగుతోందని, అవన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది. ' రూ.2 వేలు విలువ దాటిన ట్రాన్సాక్షన్లపై జీఎస్‌టీ విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందంటూ సోషల్ మీడియాల్లో వార్తలు కనిపించాయి. అవన్నీ పూర్తిగా అవాస్తవం. అందులో ఎలాంటి నిజం లేదు. తప్పుదోవ పట్టించేవి. ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదు' అని కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్లను మరింత ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది.


  త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు పైబడి చేసే యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఏకంగా 18 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేయాలని భావిస్తోందని సోషల్ మీడియాల్లో పలువులు పోస్టులు చేశారు. పలు మీడియాలు సైతం దీనిపై వార్తా కథనాలు రాశాయి. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు ఒక పెద్ద మార్గంగా కేంద్రం భావిస్తోందని పేర్కొన్నాయి. యూపీఐ పేమెంట్లపై జీఎస్టీ అమలు చేస్తే సాధారణ వినయోగదారుల నుంచి చిరు వ్యాపారుల వరకు అందరిపైనా ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. యూపీఐ పేమెంట్లు ఒక్కసారిగా పడిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లు అర్థమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa