ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖైదీల కోసం ఏకాంత గదుల ఏర్పాటు.. జైల్లో ఉండగానే భాగస్వాములతో ఎంజాయ్ చేయొచ్చు

international |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 11:20 PM

ఇటలీలోని జైళ్లలో ఉండే ఖైదీలు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మానసిక అనారోగ్యంతో కొందరు, జైల్లో ఉండి నరకం చూడలేక మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే వీటిని అరిక్టేటందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఖైదీలకు అనేక వసతులు కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు ఎక్కువ సార్లు ఫోనే చేసుకునే వీలును కల్పించారు. ఇది మాత్రమే కాకుండా తాజాగా భాగస్వాములతో ఏకాంతంగా కలుసుకుని శృంగారం చేసుకునే వీలును కూడా కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు.


గతేడాది జనవరి నెలలో ఇటలీలోని కాన్‌స్టిట్యూషనల్ కోర్టు న్యాయస్థానం ఖైదీలకు సైతం తమ భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని.. అందుకోసం వారికోసం ఏకాంత గదులు ఏర్పాటు చేయాలంటూ తీర్పు ఇచ్చింది. అలాగే ఖైదీల కోసం అక్కడకు వచ్చే వారిలో వారి భార్య లేదా భర్త.. ఎక్కువ కాలం సహజీవనం చేసిన భాగస్వాములు మాత్రమే ఉండాలని కూడా పేర్కొంది. అయితే వారు కలుసుకునే సమయంలో.. ఆ గదుల వద్ద జైలు గార్డులు ఉండకూడదని వివరించింది. దీనికి అనుగుణంగానే అధికారులు చర్యలు చేపట్టారు.


దీంతో ఇటలీలోని అన్ని జైళ్లలో ప్రత్యేకంగా ఏకాంత గదులను ఏర్పాటు చేశారు. తొలిసారిగా సెంట్రల్ ఉంబ్రియా ప్రాంతంలోని జైల్లో ఈ ప్రత్యేక సదుపాయాన్ని శుక్రవారం రోజు నుంచే అందుబాటులోకి తీసుకు వచ్చారు. దీనిపై ఖైదీలు హక్కుల కార్యకర్తలు సహా ఖైదీల కుటుంబ సభ్యులు తెగ సంబుర పడిపోతున్నారు. అయితే ఏకాంత గదుల ఏర్పాటు చాలా మంచిదని.. అయితే దాన్ని వినియోగించుకునే ఖైదీల వ్యక్తిగత గోపత్యకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలని కార్యకర్తలు వివరిస్తున్నారు. ఇలా చేస్తేనే వారు ఈ అవకాశాన్ని వాడుకోగల్గుతారని లేకపోతే.. సమస్యలు వస్తాయని దూరంగా ఉంటారని చెప్పుకొస్తున్నారు.


అయితే ఇలాంటి సదుపాయం ఐరోపాలోని చాలా దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్‌లోని కొన్ని జైళ్లలో కూడా ఖైదీలకు ఏకాంత గదులు ఉన్నాయి. ఇప్పుడు ఇటలీలో కూడా ఏర్పాటు చేయగా.. అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటలీలోని జైళ్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి. మొత్తంగా ఈదేశంలో 62 వేల మంది ఖైదీలు ప్రస్తుతం శిక్షను అనుభవిస్తుండగా.. జైళ్ల గరిష్ఠ సామర్థ్యం కంటే ఈ సంఖ్య 21 శాతం ఎక్కువ కావడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa