కెనడాలో ఇద్దరు కారు డ్రైవర్ల మధ్య జరిగిన గొడవలో.. ఎలాంటి సంబంధమూ లేని ఓ భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ముఖ్యంగా వారిద్దరూ దూరం దూరంగా ఉండే ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటుండగా.. అదే సమయంలో పని నిమిత్తం వేరే చోటుకు వెళ్లేందుకు అక్కడి బస్టాప్లో ఓ అమ్మాయి నిలబడి ఉంది. ఈక్రమంలోనే ఓ డ్రైవర్ కాల్పులు జరపగా అది మిస్ ఫైర్ అయి.. దురదృష్టవశాత్తు భారతీయ విద్యార్థిని శరీరంలోకి దూసుకొచ్చింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయింది. విషయం గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం.
భారత్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల హర్సిమ్రత్ రంధవా ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లింది. అక్కడి ఒంటారియాలో నివిసిస్తూ.. హమిల్టన్లోని ఓ కాలేజీలో చదువుకుంటోంది. అయితే బుధవారం రోజు కూడా కాలేజీకి వెళ్లేందుకు ముస్తాబైన ఆమె... స్థానిక బస్టాప్ వద్ద వేచి ఉంది. అయితే అదే సమయంలో కారులో వచ్చిన ఓ దుండగుడు.. అక్కడే ఆగి ఉన్న మరో కారులోని డ్రైవర్పై కాల్పులు జరిపాడు. అది గుర్తించిన బాధిత డ్రైవర్ తప్పించుకునేందుకు చాలానే ప్రయత్నాలు చేశాడు. కానీ నిందితుడు మాత్రం కాల్పులు జరుపుతూనే ఉన్నాడు.
ఈక్రమంలోనే ఓ బుల్లెట్ మిస్ ఫైర్ అయి.. అక్కడే బస్టాప్లో నిలబడి ఉన్న హర్సిమ్రత్ రంధవాకు తగిలింది. ఒక్కసారిగా ఆ బుల్లెట్ ఆమె శరీరంలోకి దూసుకెళ్లగా.. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావం అయి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో నిందుతడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అలాగే బాధిత డ్రైవర్ కూడా కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు.. హర్సిమ్రత్ బస్టాపులో పడి ఉండడం చూసి.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని హర్సిమ్రత్ను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు ధ్రువీకరించారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది భారతీయ విద్యార్థిని కావడంతో.. భారత కాన్సులేట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో భారత కాన్సులేట్ తీవ్రర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎవరో జరిపిన కాల్పుల ఘటనలో.. ఎలాంటి సంబంధం లేని ఓ అమాయక విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం విచారకరం అని పేర్కొంది. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని.. అవసరమైన సాయం అందిస్తూ.. ఆమె మృతదేహాన్ని ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa