ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షుగర్ ఉన్నవారు ఆపిల్, పైనాపిల్ జ్యూస్‌లు తాగొచ్చా

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 11:52 PM

​షుగర్‌తో బాధపడేవారు రోజు తిసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఫుడ్స్‌ని తక్కువగా తీసుకోవాలి. మరికొన్ని ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ షుగర్ ఉన్నవారు తీసుకోకూడదు. వీటితో పాటు డాక్టర్ సజెస్ట్ మెడిసిన్ సరిగ్గా తీసుకుంటూ రెగ్యులర్‌గా డైట్ తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని కొంతవరకు అదుపులో ఉంచుకోవచ్చు. ఈ వ్యాధి ఒక్కసారి కనిపించిన తర్వాత జీవితాంతం మనల్ని వదిలి వెళ్లదు. కాబట్టి, కొన్ని లైఫ్‌స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీరు ఈ సమస్యని తప్పించుకోవచ్చు.


డాక్టర్ ప్రకారం


ఢిల్లీకి చెందిన సీనియర్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ డయాబెటిస్ పేషెంట్స్ కొన్ని రకాల పండ్ల రసాలు తాగడం మానేయాలి. ఎందుకంటే, కొన్ని పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఉదయాన్నే పండ్ల రసాలు తాగడానికి ఇష్టపడతారు. కానీ, ఇలా తాగితే అస్సలు మంచిది కాదు. వాటి బదులు పండ్లనే నేరుగా తీసుకోవడం మంచిది.


పైనాపిల్


తీపి, పుల్లని పైనాపిల్‌లో సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉండడమే కాకుండా, ఈ పండు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు ఈ జ్యూస్‌కి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు.


గ్రేప్ జ్యూస్


ద్రాక్షలో చక్కెర ఎక్కువగా ఉంటుందని డాక్టర్స్ చెబుతున్నారు. ఈ పండ్లని జ్యూస్‌లా తాగే బదులు నేరుగా తినాలి. అది కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇప్పటికే అధిక రక్తంలో చక్కెర ఉన్నవారు రోజూ ద్రాక్ష పండ్లు తినడం మంచిది కాదు.


ఆపిల్ జ్యూస్


ఆపిల్ తీసుకుంటే ఎన్నో సమస్యల నుండి తప్పించుకోవ్చు. ఆపిల్స్ నిజంగా ఖరీదైనప్పటికీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, పండ్ల రసం తాగే బదులు, లంచ్ తర్వాత రెండు ముక్కలు తింటే మంచిది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, సహజ చక్కెర ఎక్కువగా ఈ పండుని జ్యూస్‌లా చేసుకుని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు.


ఏం తాగాలి


షుగర్ ఉన్నవారు కాకరకాయ జ్యూస్ తాగడం మంచిది. దీని వల్ల షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. ​


గుమ్మడికాయ..


ఈ కాయ కూడా షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. ఈ కాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ​


దోసకాయ


దోసకాయ, పుదీనా జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వాటి రసం తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa