ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోప్ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది

international |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 11:14 PM

కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రావిన్స్ 88 ఏళ్ల వయసులో పలు అనారోగ్య సమస్యలు ఈరోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆయన మృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేథలిక్‌లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన అంత్యక్రియలు ఎలా నిర్వహించబోతున్నారు.. ఒక పోప్ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది.. ఎలాంటి పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తారో తెలుసుకోవాలని అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


వాటికన్‌లో పోప్ మరణాన్ని అధికారికంగా ప్రకటించిన కొద్ది సేపటికే అధికారులు ఆయన మరణాన్ని ధ్రువీకరించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ బాధ్యత సాధారణంగా వాటికన్ ఆరోగ్య శాఖ కామెంర్లెంగోపై ఉంటుంది. అయితే 77 ఏళ్ల వయసు కల్గిన కార్డినల్ కెవిన్ జోసెఫ్ ఫారెల్.. మరణాన్ని నిర్ధారించడం, ప్రారంభ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పోప్ మృతదేహాన్ని ఆయన ప్రైవేట్ ప్రార్థనా మందిరానికి తరలించడం ఆనవాయితీగా వస్తోంది. అక్కడే పోప్ మృతదేహాన్ని తెల్లటి కాసోక్‌లో చుట్టి.. జింక్ లైన్డ్ చెక్క శవపేటికలో ఉంచుతారు.


గతంలో పోప్‌ల మృతదేహాలను తరలించేందుకు కఠిన పద్ధతులు పాటించాల్సి ఉండగా.. వాటిని సులభతరం చేశారు పోప్ ఫ్రాన్సిస్. ముఖ్యంగా గతంలో పోప్‌లను మూడు అంచెలున్న సైప్రస్ చెట్టు, సీసం, సిందూర వృక్షంతో తయారు అయిన శవపేటికలను మాత్రమే వాడగా.. ఉత్తి చెక్క శవపేటిక వాడితే సరిపోతుందని ఇటీవలే సూచించారు. ఇలా ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ కోసం జింక్ లైన్డ్ పట్టీతో ఉన్న శవపేటికను వాడబోతున్నారు. అయితే ఎర్రటి వస్త్రాలతో పోప్‌ను అలంకరించి.. ఆపై తెల్లటి కాసోక్ చుట్టి శవపేటికలో ఉంచుతారు.


ఆ తర్వాత పోప్ మృతదేహాన్ని వాటికన్ సిటీలోని సెయింట్ పీటల్స్ బాసిలికా చర్చిలో ప్రజల సందర్శనార్థం ఎత్తుగా ఉండే కాటాఫల్క్ అనే ప్రదేశంలో ఉంచుతారు. కానీ పోప్ ఫ్రాన్సిస్ ఆ పద్ధతికి కూడా రద్దు చేశారు. చివరి చూపు చూడాలనుకునే వారు.. పోప్ పార్థివ దేహాన్ని శవ పేటికలో తిలకించే అవకాశం కల్పించారు. అందుకోసం శవపేటిక పైకప్పును తీసి ఉంచుతారు. అలాగే ఆచార సన్నాహాల తర్వాత వాటికన్ తొమ్మిది రోజుల సంతాప దినాన్ని ప్రకటిస్తుంది. దీన్ని నోవెండియేల్ అని పిలుస్తారు. ఈ దినాల్లో వివిధ సేవలు, స్మారక కార్యక్రమాలు జరిపిస్తుంటారు.


ఇదిలా ఉండగా.. అంత్యక్రియలు నిర్వహించబోయే ముందు అతని పాలనలో ముద్రించిన నాణేల సంచి, రోగిటో అని పిలువబడే పత్రాన్ని శవపేటిక లోపల ఉంచుతారు. ఆ తర్వాత పాపసీ ముగింపును సూచించే ఓ సింబాలిక్ ఆచారంలో జాలరి ఉంగరం అని పిలువబడే పోప్ అధికారిక ముద్ర ఆచారంగా విరిగిపోతుంది. చరిత్రాత్మకంగా కామెంర్లెంగో ఓ పనిని ఓ ప్రత్యేకమైన సుత్తిని ఉపయోగించిన ఉంగరాన్ని చూర్ణం చేస్తారు. దాని తర్వాత పోప్ జీవితం విజయాలను వివరించే రోజిటోను సాంప్రదాయకంగా శవపేటికను మూసివేసే ముందు గట్టిగా చదువుతారు. ఇలా అంత్యక్రియలను నిర్వహిస్తుంటారు. అయితే పోప్ ఫ్రావిన్స్ మరణించిన నాలుగు నుంచి ఆరు రోజుల తర్వాత అంత్యక్రియలు జరగబోతున్నాయని తెలుస్తోంది. అది కూడా రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చిలో పోప్ ఫ్రాన్సిస్‌ను ఖననం చేయనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa