ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజస్థాన్‌కు షాక్.. కీలక మ్యాచ్‌కు కెప్టెన్‌ దూరం

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 11:26 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డ సంజూ శాంసన్.. ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు దూరమైన అతడు.. రాజస్థాన్ ఈనెల 24న ఆడే మరో మ్యాచ్‌కు సైతం దూరం కానున్నాడు! ఈనెల 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ తలపడనుంది. ఈ టోర్నీలో ప్లే ఆఫ్స్ చేరాలంటే రాజస్థాన్.. మిగిలిన ఆరు మ్యాచ్‌లలోనూ గెలవాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో సంజూ లేకపోవడం ఆ జట్టుకు లోటే.!


ఈ టోర్నీలో వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ గాయంతో ఆర్సీబీతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా సంజూ శాంసన్ గాయపడ్డాడు. దీంతో బ్యాటింగ్ వదిలేసి.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.


ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌.. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లోనూ సంజూ ఆడలేదు. అతడి స్థానంలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌ డెబ్యూ చేశాడు. అయితే గాయంతో బాధ ప‌డుతున్న కెప్టెన్ సంజూ శాంస‌న్ మ‌రో మ్యాచ్‌కూ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఏప్రిల్ 24న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో తలపడనుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే రాజస్థాన్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం కీలకం.


ఈ పరిస్థితుల్లో ఆర్సీబీతో మ్యాచ్‌కు సంజూ దూరమవడం.. ఆ జట్టుకు ఎదురుదెబ్బ లాంటిదే. అతడు లేకుంటే రాజస్థాన్ టాప్ ఆర్డర్‌ బలహీనంగా మారిపోతుందనే విశ్లేషణలు ఉన్నాయి. “కెప్టెన్ సంజూ శాంస‌న్ కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అత‌డు రాజ‌స్థాన్ వైద్య బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడు. అయితే.. సంజూ శాంసన్‌ ప్రస్తుత ఆరోగ్య ప‌రిస్థితి దృష్ట్యా కొన్ని రోజులు ప్ర‌యాణాలు చేయ‌కూడ‌ద‌ని వైద్యులు సూచించారు. దీంతో బెంగళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఆర్సీబీతో జ‌రిగే మ్యాచ్ కోసం అత‌డు జ‌ట్టుతో పాటు బెంగ‌ళూరుకు వెళ్ల‌డం లేదు. ఇది మాకు పెద్ద ఎదురుదెబ్బ‌. ఏదిఏమైనా త్వ‌ర‌లోనే అత‌డు జట్టుతో క‌లుస్తాడ‌ని ఆశిస్తున్నాం” అని రాజస్థాన్ రాయల్స్ వర్గాలు వెల్లడించాయి. ఇక సంజూ శాంసన్ గాయం నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం ఉంది. ఇక ఈ ఎడిష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఆడిన‌ 8 మ్యాచుల్లో ఆరింట్లో ఓడింది రాజస్థాన్. కేవలం రెండింట్లోనే గెలిచి.. పాయింట్స్ టేబుల్‌లో 8వ ప్లేసులో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa