జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తనను తీవ్రంగా కలచివేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అర్థరహిత హింసాకాండను అత్యంత తీవ్రమైన పదజాలంతో ఖండిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ దురదృష్టకర ఘటనపై చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడి అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడటం పిరికిపంద చర్య అని ఆయన అభివర్ణించారు.ఉగ్రదాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తన ప్రకటనలో వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa