ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం మారణహోమానికి ప్రధాన సూత్రధారి

national |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 09:42 PM

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళ వారం జరిగిన మారణ హోమంలో మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఉగ్రదాడి వెనుక పాక్ లష్కరే కమాండర్ ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరి హత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన సూత్రధారి ఈయనే అని కూడా తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడికి ఈయనే దగ్గరుండి ప్లాన్ చేసినట్లు సమచారం. అసలు ఇతడెవరు, పహల్గాంలో దాడి ఎందుకు చేయాలనుకున్నాడో తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాలు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాయి. ఆపూర్తి వివరాలు మీకోసం.


సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్.. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే సంస్థలో కీలక వ్యక్తి. అలాగే లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఖలీద్ ప్రస్తుతం లష్కరే పెషావర్ ప్రధాన కార్యాలయానికి అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే మిల్లీ ముస్లీంలీగ్ సంస్థకు అధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నారు. అయితే ఇదంతా హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్ ఉద్ దవా (జేయూడీ)కి రాజకీయ విభాగం. ఈ జమాత్ విభాగం పంజాబ్ ప్రావిన్సు సమన్వయ విభాగం కూడా ఇతడే చూస్తున్నాడు. ఇదంతా బాగానే ఉండగా జేయూడీని అమెరికా విదేశాంగ శాఖ లష్కరే అనుబంధ సంస్థగా గుర్తించి ఉగ్ర ముద్ర వేసింది.


అయితే ప్రస్తుతం ఖలీద్ ఇస్లామాబాద్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐఎస్ఐ, పాక్ ఆర్మీతో కూడా ఇతడికి చాలా సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా పాక్ ఆర్మీలో పని చేసిన ఆసీఫ్ ఫౌజీ అనే వ్యక్తితో సన్నిహిత చర్చలు జరిపి.. ఉగ్రవాదుల బృందానికి నాయకుడిగా ఖలీజ్ నియమించినట్లు అంతా భావిస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు బృందాలు విడుదల చేసిన ఊహాచిత్రాల్లో ఆసీఫ్ ఫౌజీ ఫొటో కూడా ఉంది. ఈయన నేతృత్వంలోనే పీఓకేకి చెందిన మరో ఇద్దరు వ్యక్తుల సాయ తీసుకుని దాడికి పాల్పడ్డట్లు నిఘా సంస్థలు గుర్తించినట్లు జాతీయ మీడియా చెబుతోంది.


అయితే ఈ నలుగురు నిందితులకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని.. వీరికి ముగ్గురు స్థానికులు సాయం కూడా చేశారని తెలుస్తోంది. అయితే ఇందులో ఇద్దరు పాకిస్థానీలు కాగా.. మరో ఇద్దరు విదేశాలకు చెందిన వారని సమాచారం. ముష్కరులు దాడి సమయంలో పష్తూన్ భాషలో మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ద్వారా అధికారులు తెలుసుకున్నారు. చూడాలి మరి ఈ కేసులో అసలు నిందితులు ఎవరనేది ఎప్పుడు తేలుస్తారనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa