ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్ఓసీ వెంట 42 ఉగ్రస్థావరాలు.. కాశ్మీర్‌లో 115 మంది ఉగ్రవాదులు.. పక్కా ప్లాన్‌తోనే

national |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 09:45 PM

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముఖ్యంగా భారత బలగాలు, పోలీసులు అయితే అంత మంది చనిపోవడంతో ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈక్రమంలోనే దేశంలో ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారు, జమ్ము కశ్మీర్‌లో ప్రస్తుతం ఎన్ని ఉగ్ర స్థావరాలు ఉన్నాయి వంటివి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎల్ఓసీ వెంట మొత్తంగా 42 ఉగ్ర స్థావరాలు (లాంచ్ ప్యాడ్స్) ఉండగా.. దేశ వ్యాప్తంగా 125 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. అయితే జమ్ము కశ్మీర్‌లోనే మొత్తంగా 115 మంది పాకిస్థానీ టెర్రరిస్టులు ఉన్నట్లు భద్రతా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.


భద్రతా దళాలు నిర్వహిస్తున్న రికార్డుల ఆధారంగా జమ్ము ఎదుర్కుంటున్న 32 ఉగ్ర స్థావరాల్లో (నియంత్రణ రేఖలోని చిన్న గ్రామాలు) 100 మంది ఉగ్రవాదులు ఉన్నారని తెలుస్తోంది. అలాగే వీరు వీలు దొరికితే దేశంలోకి చొరబడేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు కాశ్మీర్‌కు ఎదురుగా ఉన్న 10 లాంచ్ ప్యాడ్లలో 35 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు చెప్పారు. గత ఆరు నెలల్లో 50 చొబరాటు ప్రయత్నాలు జరగ్గా.. అధికారులు తిప్పి కొట్టినట్లు పేర్కొన్నారు. మరికొంత మంది ఉగ్రవాదులు దక్షిణం వైపునుంచి చొరబడి కశ్మీర్ వైపు కదిలినట్లు వివరించారు.


ఇలా ప్రస్తుతం కాశ్మీర్‌లో 75 మంది ఉగ్రవాదులు ఉండగా.. జమ్ము ప్రాంతంలో 50 మంది ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తంగా 125 మంది టెర్రరిస్టులు ఉండగా.. అందులో పాకిస్థాన్‌కు చెందిన వారే 115 మంది అని చెప్పారు. అలాగే కేవలం 10 మంది మాత్రమే స్వదేశీయులుగా పెరిగారని పేర్కొన్నారు. అయితే ఈ ఉగ్రవాదులు అందరికీ సాంకేతియ సాయం కూడా లభిస్తోందని.. డ్రోన్ల ద్వారా ఆయుధాల పంపిణీ జరుగుతుందని చెప్పుకొచ్చారు. 2023లో మొత్తంగా 125 డ్రోన్లు స్వాధీనం చేసుకున్నామని, గతేడాది భద్రతా బలగాలు 300 డ్రోన్లను గుర్తించినట్టు స్పష్టం చేశారు.


2022లో ఉగ్రవాద దాడుల సంఖ్య 107 కాగా.. 2023లో 27, 2024లో 26 సార్లు దాడులు జరిగాయన్నారు. అయితే ఈ ఏడాది మార్చి వరకు 3 సార్లు మాత్రమే ఈ దాడులు జరగ్గా.. ఎవరూ ఊహించని విధంగా పహల్గాంలో దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. గత రెండేళ్లుగా దాడులు తక్కువ కావడంతో.. జమ్ము కశ్మీర్‌కు పర్యటకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. గతేడాది మొత్తంగా 2.35 కోట్ల మంది జమ్ము కశ్మీర్‌ను సందర్శించారు. 5 లక్షల మంది భక్తులు అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. ఇల శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో రోజువారీ పర్యాటకుల సంఖ్య 11 వేలు. కానీ తాజాగా జరిగిన ఈ ఉగ్రదాడితో పర్యటకుల సంఖ్య తీవ్రంగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa