ఈమధ్య కాలంలో అనేక దేశాల్లో జననాల రేటు తీవ్రంగా తగ్గుతోంది. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు.. పౌరులు ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు సరికొత్త పథకాలు తీసుకు వస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాయి. అచ్చంగా అమెరికా కూడా ఇదే పద్దతిని పాటించబోతుంది. ముఖ్యంగా తమ దేశంలో జననాల రేటు తగ్గుదలపై దృష్టి సారించిన అమెరికా సర్కారు.. బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి రూ.4.25 లక్షలు అందించేందుకు సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు, ఎంత మంది బిడ్డలకు జన్మనిచ్చినా తల్లికి ఈ డబ్బు లభించబోతుందని సమాచారం. ఆ పూర్తి వివరాలు మీకోసం.
అగ్రరాజ్యం అమెరికాలో గత 34 ఏళ్లుగా జననాల రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా 1990 నుంచి సంతానోత్పత్తి రేటు పూర్తిగా క్షీణించడాన్ని అక్కడి సర్కారు గుర్తించింది. సీడీసీ నివేదిక ప్రకారం 2023లో సంతానోత్పత్తి రేటు 1.62గా ఉండగా.. రీప్లేస్మెంట్ రేటు కంటే ఇది చాలా తక్కువ. పెరుగుతున్న జీవనం వ్యయం, శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం, సమాజాకి విలువల్లో మార్పులు వంటి వాటి వల్ల ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు జంటలకు ఆసక్తి కనబర్చడం లేదు. ఫలితంగా సంతానోత్పత్తి రేటు తీవ్రంగా తగ్గుతూ వస్తోంది. అయితే ఈ విషయాలను అర్థం చేసుకున్న అమెరికా ప్రభుత్వధినేతలు చాలా రోజులుగా పౌరులు ఎక్కువ మంది పిలల్ని కనాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం దేశంలో క్షీణిస్తున్న సంతానోత్పత్తిపై పలుమార్లు స్పందించారు. నాగరికత సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన ఉందని వ్యక్తం చేశారు. మరోవైపు డోజ్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఎక్కువ మంది పిల్లల్ని కనమంటూ పలుమార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు చెప్పడంతో పాటు ఆయన కూడా ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు. ఇప్పటికే మస్క్కు 14 మంది పిల్లలు ఉండగా.. మరికొందరికి కూడా జన్మనిస్తానంటూ ఇటీవలే చెప్పారు. ఇలా ఎవరు ఎంత చెప్పినా పౌరుల్లో మార్పు రాకపోవడంతో ట్రంప్ సర్కారు సరికొత్త పథకం తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
ఇందుకు సంబంధించిన అంతర్గతంగా శ్వేతసౌధంలో అమెరికా ఓ కీలక సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఈక్రమంలోనే సంతానసాఫల్యంపై మహిళలకు అవగాహన కల్పించడం, బిడ్డల్ని కనే కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై చర్చించారు. ఇందులో భాగంగానే బిడ్డకు జన్మనిచ్చే ప్రతి అమెరికన్ మాతృ మార్తికి బేబీ బోనస్ కింద 5 వేల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.4.25 లక్షలు) ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అలాగే పన్ను మనిహాయింపులు వంటివి కూడా కల్పించాలని భావిస్తోంది. పెళ్లి చేసుకున్న వారితో పాటు పిల్లలున్న వారికి ప్రతిష్ఠాత్మక స్కాలర్షిప్లలో 30 శాతం స్లాట్లు కేటాయించాలని కూడా ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa