ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. శుక్రవారం హస్తినకు వెళ్లి సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశంకానున్నారు. మే 2న అమరావతి పర్యటనకు (నిర్మాణ పనులను ప్రారంభోత్సవం) రావాలని ఆహ్వానించనున్నారు. అమరావతి, ఏపీకి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా ఢిల్లీ పర్యటనకు వెళతారనే ప్రచారం కూడా జరుగుతోంది.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే చంద్రబాబు శుక్రవారం రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు.. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి విశాఖపట్నం వెళతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల చేరుకుంటారు.. అక్కడ మత్స్యకార భరోసా నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు వేట నిషేధం అమల్లో ఉంది.. ఈ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు ఒక్కొక్కరికి రూ.20వేలు ఇస్తామని హామీ ఇవ్వగా.. శనివారం ఈ పథకం ప్రారంభంకానుంది.
చంద్రబాబు ఇవాళ కూడా బిజీగా గడిపారు. ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి వెళ్లి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సచివాలయంలో అధికారులతో 11.30 నుంచి 1.30 గంటల వరకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ & మిషన్ లెర్నింగ్పై వర్క్షాప్లో పాల్గొనగా.. వర్క్షాప్కు హాజరైన సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ హాజరయ్యారు. వాద్వాని సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీఈవో ప్రకాష్ కుమార్, డబ్ల్యుజీడీటీ డీన్ కమల్ దాస్తో సహా పలువురు నిపుణులు వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు.
గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చ జరిగింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వచ్చే ఫలితాలపై కేస్ స్టడీస్ పరిశీలించారు. ఏయే విభాగాల్లో ఎటువంటి సాంకేతికను వినియోగించవచ్చు, ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా సేవల్ని ఎలా విస్తృత పరచవచ్చు అనే దానిపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఏఐ, ఎంఎల్, డీఎల్, చాట్ జీపీటీ, జెమిని, డేటా డ్రివెన్, ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్, ఏఐ ప్లేబుక్, ఏఐ బేస్డ్ పైలెట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్ జరిగాయి. వ్యవసాయం, విద్య, వైద్య, పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పలువురు నిపుణులు వివరించారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న వర్క్షాప్లో మొదటిరోజు కార్యదర్శులు.. రెండోరోజు హాజరుకానున్న విభాగాధిపతులు హాజరవుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa