ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భారత పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు

national |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 07:21 PM

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భారత పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇవాళ ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వాషింగ్టన్‌కు తిరుగు పయనమయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. వాన్స్ వెంట భార్య ఉష వాన్స్, వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు.ఇటీవల ప్రధాని మోదీతో భేటీ అనంతరం వాన్స్ కుటుంబం సోమవారం ఏప్రిల్ 21 రాత్రి ఢిల్లీ నుంచి జైపూర్ చేరుకుంది. మరుసటి రోజు, మంగళవారం ఏప్రిల్ 22 నాడు వారు చారిత్రక అంబర్ కోటను సందర్శించారు. అనంతరం జైపూర్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో జేడీ వాన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతపై ప్రసంగించారు.బుధవారం ఏప్రిల్ 23 నాడు వాన్స్ కుటుంబం ఆగ్రా నగరాన్ని సందర్శించింది. అక్కడ వారు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తాజ్ మహల్ అందాలను తిలకించారు. ఆగ్రా పర్యటన అనంతరం వారు తిరిగి జైపూర్ చేరుకున్నారు.జేడీ వాన్స్ తన భారత పర్యటనను సోమవారం (ఏప్రిల్ 21) ఢిల్లీలో ప్రారంభించారు. తొలుత వారు ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నాలుగు రోజుల పర్యటన అనంతరం వారు జైపూర్ నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa