ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే సస్పెన్షన్ ను ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అభియోగ పత్రం ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ నమోదు చేసింది. సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. ఇటీవల సస్పెండైన సునీల్ కుమార్, గతంలో సీఐడీ చీఫ్గా, అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన కాలంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం పేర్కొంది.ప్రభుత్వం నమోదు చేసిన ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్లో ప్రధానంగా ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన అంశాలున్నాయి. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా, తీసుకున్న అనుమతికి భిన్నంగా పలుమార్లు విదేశాలకు వెళ్లినట్లు అభియోగాలు మోపింది. మొత్తం ఆరు వేర్వేరు సందర్భాల్లో ఈ ఉల్లంఘనలు జరిగినట్లు ప్రభుత్వం తన అభియోగ పత్రంలో వివరంగా పేర్కొంది.అభియోగాలకు సంబంధించి, ప్రతిదానికి విడివిడిగా 30 రోజుల్లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలని సునీల్ కుమార్ను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా, ఈ అభియోగాలపై జరిగే విచారణ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడానికి ప్రయత్నించినా, అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 అక్టోబర్ 24 నుంచి 2023 జనవరి 23 వరకు సీఐడీ చీఫ్గా2023 మార్చి 10 నుంచి 2024 జూన్ 20 వరకు ఫైర్ సర్వీసెస్ డీజీగా సునీల్ కుమార్ పనిచేశారు. ఈ కాలంలోనే సర్వీసు నిబంధనల ఉల్లంఘన జరిగిందని ప్రభుత్వం అభియోగాలలో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa