ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్లామాబాద్ సభలో హఫీజ్ సయీద్ సంచలన వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 06:50 PM

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం. కశ్మీర్ నదుల్లో హిందువుల రక్తం పారిస్తాం. యుద్ధం మొదలు పెడతాం. మీ అంతు చూస్తాం" అంటూ వరల్డ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన సభలో అతడు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.పాకిస్థాన్‌కు నీళ్లు ఆపుతారా, మీ ఊపిరి ఆపేస్తాం జాగ్రత్త అంటూ హఫీజ్ సయీద్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి హెచ్చరించాడు. సింధూ నదిలో నీళ్లకు బదులు మీ రక్తం పారిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మేం బంగ్లాదేశ్‌ను విడదీశామని ఢాకాలో నిలబడి చెబుతున్నారా అని మోదీపై ధ్వజమెత్తాడు.ఇందుకోసం నువ్వూ రక్తం ఇచ్చావని చెబుతున్నావ్ కదా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించాడు. మేం మౌనంగా ఉండేది లేదని, నువ్వు అంటే మేమూ అంటామని హఫీజ్ సయీద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. కశ్మీర్‌లో డ్యాం కట్టి పాకిస్థాన్‌కు నీళ్లు ఆపుతారా, మేం ఊరుకుంటామని అనుకుంటున్నారా అని మండిపడ్డాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa