ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఐదు మున్సిపాలిటీలలో జరగనున్న ఎన్నికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 11:12 AM

విశాఖపట్నం, గుంటూరు నగర మేయర్‌ పదవులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు మున్సిపాలిటీలలో మొత్తం తొమ్మిది పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కుప్పం, తుని, పాలకొండలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులకు.. మాచర్ల, తాడిపత్రి (2), తునిలో వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోసం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఈనెల 22న నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.  కుప్పం మున్సిపల్‌ చైర్సన్‌ ఎన్నికల  కోసం వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిల‌ర్లు  బెంగళూరు క్యాంపు నుంచి  ఎమ్మెల్సీ భ‌ర‌త్ నేతృత్వంలో కుప్పంకు ట్రైన్‌లో బయలుదేరి వ‌చ్చారు. కుప్పం రైల్వేస్టేషన్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు పోలీస్ భద్రతతో కౌన్సిలర్లు రానున్నారు. ఎమ్మెల్సీ భరత్ ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. కాగా, బెంగళూరు క్యాంపు నుంచి వస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లకు బందోబస్తు కల్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వ‌డంతో కుప్పంలో 144 సెక్ష‌న్ విధించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa