ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 02:14 PM

సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఇవాళ(సోమవారం) రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ, క్లస్టర్ల రూపకల్ప కోసం మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమం జరిగింది. మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ సదస్సులో ఎంపీ కేశినేని శివనాథ్ కీలక ప్రసంగం చేశారు. సీఎం చంద్రబాబు విజన్ 2020 వల్ల రాష్ట్రం టెక్నాలజీ రంగంలో అభివృద్ధి పథంలో సాగుతోందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో విమానయానం, రక్షణ రంగాల్లో కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే వందశాతం రక్షణ రంగ ఉత్పత్తులు తయారికీ కృషి జరుగుతుందని తెలిపారు. రాష్ట్రానికి సలహాదారులుగా ఉన్న డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ అనుభవం చాలా అవసరమని అన్నారు. రాష్ట్రం భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధివిధానాలు రూపొందిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్‌కు ఆహ్వానం పలుకుతున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa