ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ అమ్మను, తాతను చంపింది కూడా ఉగ్రవాదులే.. అది గుర్తుంచుకో..: అసదుద్దీన్ ఒవైసీ

national |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 09:36 PM

ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో.. భారత్ పాకిస్థాన్‌పై చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా ఆ దేశానికి చెందిన ముష్కరులే ఈ దాడులకు పాల్పడినట్లు గుర్తించి.. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి.. సింధు నదిలో పాకిస్థాన్ నీళ్లైనా పారాలని లేదా భారతీయుల రక్తమైనా పారాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా వీటిపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. భుట్టో మాట్లాడే మాటలు వింటుటుంటే చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తుందని.. ఆయన తల్లిని, తాతను కూడా ఉగ్రవాదులే చంపారని గుర్తు చేశారు. ఆ విషయం మర్చిపోయే.. భుట్టో ఇలా మాట్లాడుతున్నారని లేకపోతే ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేసేందుకు కృషి చేసేవారన్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు చేయడంతో పాకిస్థాన్ భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతోంది. అనేక మంది నేతలు దీనిపై రోజుకో రకంగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రెండ్రోజుల క్రితమే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి సింధు నదీ జలాల ఒప్పందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే భారత్ సింధు నది విషయంలో తమపై దాడి చేస్తోందని ఆరోపించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అంశంలో పాకిస్థాన్‌ను తప్పుగా ఆరోపిస్తూ.. ప్రధాని మోదీ వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తమ దేశమే ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తుందంటూ వెల్లడించారు.


ఇంతటితో ఆగకుండా భారత దేశానికి బిలావల్ భుట్లో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి తాము గట్టిగా బదులిస్తామన్నారు. సింధు జలాలు మావే అంటూనే.. అందులో తమ నీళ్లైనా పారాలని లేదా భారతీయుల రక్తమైనా పారాలంటూ బిలావల్ వ్యాఖ్యానించారు. క్లిష్ట పరిస్థితుల్లో నదిని రక్షించుకునేందుకు ఇండియాపై పోరాటం కొనసాగిస్తామన్నారు. అయితే తాజాగా బిలావల్ భుట్టో చేసిన ఈ కామెంట్లపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇలాంటి చిన్న పిల్లల మాటలను మర్చిపోవాలంటూనే బిలావల్ భుట్టోకు.. ఆయన తాత, తల్లికి ఏం జరిగిందో తెలియదన్నారు.


వారిద్దరినీ ఉగ్రవాదులే కాల్చి చంపారని అసదుద్దీన్ ఒవైసీ గుర్తు చేశారు. 2007 డిసెంబర్ 30వ తేదీన పాకిస్థాన్‌లోని రావల్పిండిలో జరిగిన బహిరంగ ర్యాలీలో బెనజీర్ భుట్టో హత్యకు గురయ్యారని.. ఈ ఆత్మాహుతి దాడికి అల్-ఖైదా మరియు తాలిబన్ అనుబంధ సంస్థలతో సహా బహుళ ఉగ్రవాద సంస్థలకు సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయన్నారు. ఈ కేసు ఇప్పటికీ పరిష్కరించబడలేదని.. అతని తల్లిని కూడా ఇలాగే చంపారన్నారు. ఇప్పుడు భారతీయులపై అలాంటి దాడులు జరిగినా.. ఉగ్రవాదం కాదంటూ పిచ్చిగా మాట్లాడడం చూస్తుంటే ఆయనకు ఏ విషయాలు తెలిసినట్టు లేవని అర్థం అవుతుందన్నారు.


అసలు పాకిస్థాన్‌కు అమెరికా సాయం చేయకపోతే వాళ్లు దేశాన్ని కూడా నడపలరేని అన్నారు. అలాంటి వాళ్లు మనల్ని తక్కువ చేసి చూస్తున్నారని.. అణ్వాయుధాలతో బెదిరిస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ చెప్పుకొచ్చారు. మీరు ఏ దేశంలోకి చొరబడి అయినా అమాయక ప్రజల ప్రాణాలు తీస్తే ఎవరు అధికారంలో ఉన్నా, ఏ దేశం కూడా మౌనంగా ఉండదని.. గట్టిగా బదులిస్తుందని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa