పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తామని లక్నో యూనివర్సిటీ తెలిపింది. అలాగే ఉచితంగా వసతి కల్పించడంతో పాటు పాటు పుస్తకాలు కూడా అందజేస్తామని లక్నో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలోక్ రాయ్ ప్రకటించారు. ‘ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిపై ఆధారపడిన వారు లక్నో విశ్వవిద్యాలయంలో చదివేందుకు మేం స్వాగతిస్తాం. వారి మొత్తం ఖర్చును విశ్వవిద్యాలయం భరిస్తుంది’ అని అన్నారు.ఈ ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 31 ఏళ్ల వ్యాపారి శుభం ద్వివేది కూడా ఈ ఉగ్రదాడిలో మరణించాడు. ఫిబ్రవరి 12న ఐశన్యతో అతడికి వివాహం జరిగింది. పెళ్లైన రెండు నెలలకే ఉగ్రదాడిలో భర్తను కోల్పోవడంపై ఆమె తీవ్రంగా విలపించింది. ఉగ్రదాడిలో మరణించిన శుభం ద్వివేదికి అమరవీరుడి హోదాను ప్రభుత్వం కల్పించాలని భార్యతోపాటు అతడి కుటుంబం డిమాండ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa