ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.7.93 లక్షలతో కవాసకి వెర్సిస్‌ 2025 లాంచ్

business |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 01:46 PM

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి, భారత మార్కెట్‌లోకి వెర్సిస్ 650 (2025 మోడల్‌) అడ్వెంచర్ టూరింగ్ బైక్‌ను రూ.7.93 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఓబీడీ-2బి ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఈ మోడల్‌ను తీసుకొచ్చిన సంస్థ, 2024 మోడల్‌తో పోలిస్తే దీని ధరను రూ.16వేలు పెంచింది. కొత్త రంగులు తప్ప డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. ఈ మోటార్‌ సైకిల్ 649 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ప్యారల్‌ ట్విన్‌ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 8500 ఆర్‌పీఎం వద్ద 66 హెచ్‌పీ పవర్‌ను, 7000 ఆర్‌పీఎం వద్ద 61 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. ఈ మోటార్‌ సైకిల్ బరువు 218 కేజీలు. ముందువైపు 300 ఎంఎం డిస్క్‌, వెనకవైపు 250 ఎంఎం డిస్క్‌ బ్రేక్‌ ఉన్నాయి. దీని ఫ్యూయల్‌ ట్యాంక్‌ కెపాసిటీ 21 లీటర్లు. మార్కెట్‌లో ప్రస్తుతం ట్రయంఫ్‌ టైగర్‌ స్పోర్ట్ 660కి గట్టి పోటీనిస్తంది. అయితే, ట్రయంఫ్‌ టైగర్‌ స్పోర్ట్ ధర రూ.9.45 లక్షలుగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa