ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల పెంపు

national |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 01:44 PM

మే 1 నుంచి ఏటీఎం లావాదేవీలు ఖరీదైనవిగా మారనున్నాయి. బ్యాంకులు అందిస్తున్న ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత నగదు ఉపసంహరణకు రూ.19 (ప్రస్తుతం రూ.17) ఛార్జీ విధించనున్నారు. అంతేకాకుండా బ్యాలెన్స్ చెక్ చేసుకునే ప్రతి సారి రూ.7 ఫీజు వసూలు చేయనున్నారు. ఇది గతంలో రూ. 6 లు ఉండేది. దీంతో ఏటీఎం వినియోగదారులు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి.ఉచిత లావాదేవీలకు మించి చేస్తే, ఒక కస్టమర్‌కు ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ.23 రుసుము వసూలు చేయవచ్చు. ఇది 2025 మే 1 నుంచి అమలులోకి వస్తుంది" అని ఆర్‌బీఐ ప్ర‌క‌టించింది. మే 1 నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఎందుకంటే ఏటీఎం నిర్వహణ ఖర్చులు పెరగడం, సెక్యూరిటీ కోసం ఖర్చులు ఎక్కువగా అయ్యాయని చెబుతోంది. ఇప్పటివరకూ ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి మనీ విత్‌డ్రా చేస్తే, దానికి రూ.21 తీసుకునేవారు. మే 1 నుంచి.. రూ.23 తీసుకుంటారు. దీనికి మళ్లీ అదనంగా టాక్స్ కూడా ఉంటుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa