ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటకలో దారుణం: పందెం కోసం 5 ఫుల్ బాటిళ్ల మద్యం తాగి యువకుడు మృతి

national |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 01:36 PM

కర్ణాటకలోని కోలార్ జిల్లా నన్‌గళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రూ.10,000 పందెం కోసం కార్తిక్ (21) అనే యువకుడు నీళ్లు కలపకుండా ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం తాగాడు. దీంతో అతను తీవ్ర అనారోగ్యానికి గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 
2024లో వివాహం చేసుకున్న కార్తిక్‌కు ఎనిమిది రోజుల క్రితమే సంతానం జన్మించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో నలుగురి కోసం గాలింపు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa