ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధి హామీ పథకం దేశానికి వరం: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 01:49 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని నిర్వహించిన మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా మారిందన్నారు. ఈ పథకం ద్వారా సొంత గ్రామాల్లోనే సుమారు 75 లక్షల 23 వేల మంది శ్రామికులు ఉపాధి పొందుతున్నారన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.10,669 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.‘‘పల్లె పండుగలో భాగంగా ఇప్పటికి రూ.377.37 కోట్లతో 21,564 గోకులాలు పూర్తి చేశాం. దీని వల్ల ప్రతి రైతుకు నెలకు రూ.4,200 అదనపు ఆదాయం వస్తోంది. రక్తం ధారపోసి పనిచేసేవారు లేకపోతే ఏ నిర్మాణం జరగదు. ఉపాధి కూలీలను ఉపాధి శ్రామికులుగా పిలుద్దాం. మిగతా వృత్తుల్లో ఉన్నవారిలాగే ఉపాధి శ్రామికులు కూడా గొప్పవారే. వైకాపా హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాల్జేశారు. మద్య నిషేధమంటూ వచ్చి గత ప్రభుత్వం వ్యాపారం చేసింది. మద్యం కుంభకోణానికి పాల్పడి రూ.3,200 కోట్లు కొల్లగొట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa