ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షాల ప్రభావంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 03:55 PM

ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో (ఎన్‌సీఆర్) ఈ తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదం నింపింది. ఉరుములు, మెరుపులు, వడగళ్లు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా ద్వారక ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బలమైన గాలుల ధాటికి ద్వారక ప్రాంతంలోని ఓ వ్యవసాయ భూమిలో ఉన్న బోరు బావి గదిపై పెద్ద వేప చెట్టు కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న 26 ఏళ్ల మహిళ, ఆమె ముగ్గురు పిల్లలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి నలుగురినీ బయటకు తీసి, సమీపంలోని ఆర్‌టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో మృతురాలి భర్త అజయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa