పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఉగ్రవాదుల ఏరివేతలో భారత్కు పాకిస్థాన్ సహకరించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. అదే సమయంలో, ఇరు దేశాలు సంయమనం పాటించాలని, విస్తృత ప్రాంతీయ ఘర్షణలకు తావివ్వరాదని సూచించారు.పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘పాకిస్థాన్ తమ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాదులను వేటాడి, కట్టడి చేసే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, ఈ విషయంలో భారత్కు సహకరిస్తుందని మేము ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. పహల్గామ్ దాడికి భారత్ స్పందించే తీరు విస్తృత ప్రాంతీయ ఘర్షణలకు దారితీయకుండా ఉండాలని కూడా తాము ఆశిస్తున్నట్టు వాన్స్ పేర్కొన్నారు. ‘ఈ ఉగ్రదాడికి భారత్ స్పందించే విధానం.. మరింత పెద్ద సంఘర్షణకు కారణం కాకూడదనేది మా ఆకాంక్ష’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa