ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యేక వాహనాల్లో సైతం అమరావతికి తరలివస్తున్న ప్రజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 03:59 PM

అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు  సంఖ్యలో తరలివస్తున్నారు. రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న జనంతో విజయవాడ పశ్చిమ బైపాస్ మార్గం కిటకిటలాడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బస్సులు, కార్లలో సభా స్థలికి చేరుకుంటున్నారు.కృష్ణా జిల్లా చిన్నవుటపల్లి నుంచి రాజధాని గ్రామాలను కలిపేలా నిర్మించిన విజయవాడ వెస్ట్ బైపాస్, సుదూర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చే ప్రజలకు ప్రధాన మార్గంగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి ప్రజలు ప్రత్యేక వాహనాల్లో తరలివస్తున్న దృశ్యాలు కనిపించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa