ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు కేరళలో పర్యటించారు. ముఖ్యంగా తిరువనంతపురం సమీపంలో ఏర్పాటు చేసిన విఝింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ హాజరయ్యారు. అక్కడే మోదీ వీరి పక్కన నిల్చొని షాకింగ్ కామెంట్లు చేశారు. వీరిద్దరూ తన పక్కన ఉండడం చూసి కొందరు నేతలకు ఈరోజు నిద్ర పట్టదని వివరించారు. ఇలా పరోక్షంగా కాంగ్రెస్పై వ్యంగ్యాస్త్రాలు విసరగా.. ఈ కామెంట్లు వైరల్ అయ్యాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్నారు. శుక్రవారం రోజు ఉదయమే ఆయన.. తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన విఝింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ హాజరయ్యారు. పోర్టు ప్రారంభం తర్వాత వీరంతా ఒకే వేదిక మీదకు వచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈ సీపోర్టుతో కేళలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని అన్నారు.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్లో భారత పాత్రను గణనీయంగా మారుస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వేదికపై తన పక్కన నిల్చున్న సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను ఉద్దేశించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈరోజు తన పక్క శశిథరూర్ ఉన్నారని.. ఈ కార్యక్రమం కొంత మందికి నిద్రలేని రాత్రిని మిగులుస్తుందన్నారు. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయిందని.. పరోక్షంగా కాంగ్రెస్పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈయన ఇలా ప్రత్యేకించి కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి చాలానే కారణాలు ఉన్నాయి.
ఈమధ్య కాలంలో కాంగ్రెస్ అధినాయకత్వంతో శిశి థరూర్కు పొసగడం లేదు. గత కొన్ని నెలలుగా ఈయన తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్యే ఆయన ఓ కేంద్ర మంత్రితో సెల్ఫీ దిగగా.. శశి థరూర్ పార్టీ మారబోతున్నట్లు ప్రచారం మొదలైంది. దీని తర్వాత ఆయన భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ చేసిన కామెంట్లతో దీనికి మరింత బలం చేకూరింది. ఇలాంటి సమయంలోనే మోదీ కేరళకు రావడం.. శశి థరూర్యే నేరుగా వెళ్లి స్వాగతించడంతో ఆయన కచ్చితంగా పార్టీ మారబోతున్నారని సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఇది మాత్రమే కాదండోయ్ శశి థరూర్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగానని... తన నియోజక వర్గానికి వచ్చిన ప్రధాని మోదీని సాదరనంగా స్వాగతించానని రాసుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa