ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గామ్ ఉగ్రదాడి: రేపు కేంద్రానికి ఎన్‌ఐఏ ప్రాథమిక నివేదిక

national |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 04:42 PM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముందు ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఈ నివేదికను స్వయంగా ప్రవేశపెట్టనున్నారు. 
ఈ దాడి సందర్భంగా ఇప్పటివరకు 90 మంది ఓవర్‌ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఎన్‌ఐఏ దాదాపు 3,000 మందిని విచారించగా, 100కు పైగా ప్రాంతాల్లో భద్రతా బలగాలు సోదాలు నిర్వహించాయి. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు ఎన్‌ఐఏ తీవ్రంగా దర్యాప్తు చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa