ఆంధ్రప్రదేశ్లో లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లో బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ పలువురు విద్యార్థునులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా ఫోన్లు మాట్లాడటం.. అబ్బాయిల్ని తీసుకొని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారంటూ హాస్టల్ విద్యార్థినిలు పోలీసులకు తెలిపారు. స్టూడెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. పోయిన సంవత్సరం.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కుదేపిసిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో హిడెన్ కెమెరా బయటపడింది. దాంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. ఈ కెమెరా ద్వారా చిత్రీకరించిర వీడియోలను బయట అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు విద్యార్థినులు.
ఇక ఈ సంవత్సరం మార్చి నెలలో తెలంగాణలో కూడా ఈ తరహా దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లాలోని ఓ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా వెలుగు చూడటం సంచలనంగా మారింది. హాస్టల్లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి.. అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన హాస్టల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. ఇలా తరచుగా ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటంతో.. ఆడపిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రలు భయపడే పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa