ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాటిపై కూడా పన్ను విధింపు.. భారతీయులకు ట్రంప్ మరో షాక్..

international |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 09:34 PM

అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ.. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్నారు. ఇప్పటికే ప్రతీకార సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న ట్రంప్.. ఇప్పుడు మరో సరికొత్త నిర్ణయం తీసుకుని.. భారతీయులకు అందునా తెలుగు వారికి భారీ షాక్ ఇచ్చాడని చెప్పవచ్చు. కాదేదీ సుంకానికి అనర్హం అన్నట్లు ప్రవర్తిస్తున్న ట్రంప్.. తాజాగా తెలుగు వారి జిహ్వ చాపల్యాన్ని తీర్చే పచ్చళ్లపై కన్ను వేశాడు. ఇకపై పచ్చళ్లపై కూడా పన్ను చెల్లించాలట. ఆ వివరాలు..


అమెరికాలో ఉన్న మన వాళ్లు.. ఇండియా నుంచి ఎవరైనా స్నేహితులో, బంధువులో అక్కడకు వస్తుంటే ఫలానా వస్తువులు, తినుబండారాలు, పచ్చళ్లు, పొడులు, బట్టలు, ఇతరాత్ర వస్తువలు వంటివి తీసుకురావాల్సిందిగా కోరుతుంటారు. అయితే ఇలా వ్యక్తిగత స్థాయిలో తెప్పించుకునే ఉత్పత్తుల మీద ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం పన్నులు వసూలు చేయలేదు. కానీ ఇప్పుడు అక్కడ అధికారంలో ఉంది ట్రంప్ కదా.. దాంతో ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలపై కూడా అమెరికా ప్రభుత్వం తాజాగా దృష్టి సారిస్తోంది.


వ్యక్తిగతంగా వ్యక్తుల ద్వారా, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా తెప్పించుకునే ఉత్పత్తుల మీద ఇక నుంచి అమెరికా అధికారులు నిఘా పెట్టనున్నారు. అలానే ఇలా తెప్పించుకునే వాటి మీద పన్ను వసూలు చేసి ఖజానా నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అమెరికా అధికారులు. సుంకం చెల్లించకపోతే, భారీ జరిమానాలు విధించి ఇలాంటి మార్గాలను పూర్తిగా కట్టడి చేయాలని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.


 


 


భారత్‌లో మాదిరిగానే అమెరికాలో కూడా.. సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌నే వ్యాపార వేదికలుగా మార్చుకుని అనేకమంది బిజినెస్ చేస్తున్నారు. వీరిలో పలువురు తెలుగువాళ్లు, ఇతర రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఇండియా నుంచి వివిధ ఉత్పత్తులను కొరియర్‌ ద్వారా తెప్పించుకొని..అమెరికాలో సోషల్‌ మీడియాలో ఆర్డర్లు తీసుకొని కొనుగోలుదార్లకు కొరియర్ ద్వారా డెలివరీ చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి వాటి మీద అమెరికా ప్రభుత్వం పన్నులు వసూలు చేసిన దాఖలాలు లేవు. అలానే యాప్‌ల ద్వారా జరిగే వ్యాపారాల మీద కూడా ఎలాంటి పన్నులేదు.


కానీ ఇప్పుడు ట్రంప్ సర్కార్ కన్ను ఇలాంటి వారి మీద పడింది. ఇలా ఆన్లైన్, యాప్‌ల ద్వారా విక్రయించేవారితోపాటు, కొనుగోలుదార్ల మీద కూడా సుంకాలు విధించాలని అమెరికా అధికారులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా.. భారత్‌లోని రిటైలర్ల నుంచి అమెరికాలో ఉన్న వ్యక్తులు తెప్పించుకుంటున్న షిప్మెంట్లను అధికార వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ మేరకు పలువురికి భారీ జరిమానాలు, న్యాయపరమైన చర్యలకు సంబంధించి నోటీసులు పంపుతున్నాయి.అయితే ఇప్పటి వరకు చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఇలా నోటీసులు అందాయి.


మరి వ్యక్తిగతంగా అంటే ఎవరైనా బంధుమిత్రులు అమెరికాకు వస్తుంటే వారి ద్వారా పచ్చళ్లు, తినుబండారాలు, దుస్తులు, బంగారు నగలు వంటివి తెప్పించుకుంటే వాటి మీద కూడా పన్ను చెల్లించాలా.. లేదంటే జరిమానాలు విధిస్తారా అనే చర్చ జరుగుతుంది. ఇక ట్రంప్ గనక వీటి మీద పన్ను వేస్తే.. పచ్చళ్లు, ఇతర వస్తువులు తెప్పించుకునే వారికి ఇది పెను భారంగా మారనుంది. ట్రంప్ సుంకాల ప్రకటన నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. పది గ్రాముల ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరి.. ఆ తర్వాత నెమ్మదిగా దిగా రాసాగింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa