సుప్రీంకోర్టు ఇటీవల ఒక కీలక తీర్పు వెలువరించింది, ఇందులో ఉమ్మడి కుటుంబ ఆస్తి విభజన అనంతరం, ప్రతి సభ్యునికి కేటాయించిన వాటాలు వారి వ్యక్తిగత (స్వీయ-సంపాదిత) ఆస్తిగా మారుతాయని స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పు ప్రకారం, సభ్యులు తమ వాటాలను వారి ఇష్టప్రకారం విక్రయించవచ్చు, బదిలీ చేయవచ్చు లేదా వారసత్వంగా ఇవ్వవచ్చు.
ఇందుకు ఆధారంగా కోర్టు పేర్కొన్నది ఏమిటంటే, ఒకసారి కుటుంబ ఆస్తి విభజన జరిగాక, ఆ వ్యక్తి వాటం ఇక మీదట జాయింట్ ప్రాపర్టీ కింద పరిగణించబడదు. అది పూర్తిగా వ్యక్తిగత హక్కుల పరిధిలోకి వస్తుంది. ఈ ఆస్తిపై ఇతర కుటుంబ సభ్యులకు ఇకపై హక్కు ఉండదని, ఆ వ్యక్తి ఎలాంటి ఆంక్షలు లేకుండా దానిని వినియోగించుకునే స్వేచ్ఛ కలిగి ఉంటాడని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు అనేక కుటుంబాల్లో ఆస్తుల చుట్టూ ఉన్న వివాదాలకు ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. కుటుంబ విభజన తర్వాత వచ్చిన భాగాన్ని పునఃఒకసారి కుటుంబ ఆస్తిగా పరిగణించడానికి వీలులేనని ఇది తెలియజేస్తోంది. తద్వారా వ్యక్తిగత ఆస్తి హక్కులు మరింత బలపడతాయని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa