ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ కొనుగోళ్లపై జగన్ అసత్య ప్రచారాలు: మంత్రి గొట్టిపాటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 02:52 PM

విద్యుత్ కొనుగోళ్లపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘యాక్సిస్ కంపెనీలో కూటమి ప్రభుత్వం ఒప్పందం వందశాతం సక్రమం. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజీతో చేస్తున్న తొలి ప్రాజెక్టు ఏపీలోనే పెట్టుబడి పెట్టింది. పీక్ అవర్స్‌లో రూ.8 నుంచి రూ.10 వరకూ కొనాల్సి వచ్చే సమస్యను ఇది అధిగమిస్తుంది.’ అని అన్నారు.జగన్ ఒప్పందాలకు, కూటమి ఎంఓయూలకు చాలా తేడా ఉందని చెప్పారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలు అలాంటివి మానుకుంటే మంచిదని హితవు పలికారు. విద్యుత్ కొనుగోళ్లలో జగన్ చేస్తున్న అసత్యాలు ప్రచారాలను నమ్మొద్దని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa