కెనడాలో ఉంటున్న దాదాపు 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ ఖలిస్థానీలు, వారి మద్దతుదారులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో.. ఓ వాహనాన్నే జైలుగా మార్చి అందులో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ బొమ్మలను అభ్యంతరకర రీతిలో ఉంచి ప్రదర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. ఖలిస్తానీలకు హిందువులపై ఉన్న కోపాన్ని అంతా కళ్లారా చూస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
కెనడాలో చాలా కాలంగా ఖలిస్థానీల అరాచకం కొనసాగుతూనే వస్తోంది. ఇటీవలే అక్కడి ఓ గురుద్వారా, మందిరంలో విధ్వంసం సృష్టించారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాతే.. అక్కడ నివాసం ఉంటున్న హిందువులను తిరిగి భారత్ పంపించేయాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ దిష్టి బొమ్మలను.. ఓ వాహనంపై ఏర్పాటు చేసిన జైల్లో ఉంచి ప్రదర్శించారు. టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. దీన్ని వీడియోగా తీసిన ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పెట్టారు.
ముఖ్యంగా హిందూ వ్యతిరేకతను రెచ్చగొడుతూ.. కెనడాకు చెందిన జర్నలిస్ట్ డానియల్ బోర్డమన్ దీన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే ఖలిస్థానీలపై చర్యలు తీసుకోవడంతో కొత్త ప్రధాని మార్క్ కార్నీకి, మాజీ ప్రధాని ట్రూడోకు ఏమైనా తేడా ఉందా అని ప్రశ్నించారు. మరోవైపు కెనడాలోని హిందూ సమాజానికి చెందిన నాయకుడు షవన్ బిండా సైతం ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అందులో ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదని, ఖలిస్థానీ గ్రూపునకు హిందువులపై ఉన్న వ్యతిరేకత అంటూ వివరించారు. అలాగే కెనడాలో జరిగిన అతి భయంకపమైన దాడికి ఈ గ్రూపే కారణం అంటూ వివరించారు.
అయితే ఈయన ప్రస్తావించిన భయంకరమైన దాడి కనిష్కా బాంబింగ్ ఘటన. 1985లో ఎయిర్ ఇండియా కనిష్కా విమానంపై ఖలిస్థానీలు బాంబు దాడి చేయగా.. మొత్తంగా 329 మంది ప్రాణాలు కోల్పోయారు. మాంట్రియల్ నుంచి ముంబయికి విమానం వెళ్తుండగా ఈ దాడి జరిగింది. అయితే ఇప్పటి వరకు కెనడాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనలో ఇదే మొదటిది. దీన్ని చేసింది కూడా ఇప్పుడు హిందూ వ్యతిరేకంగా నిరసన చేపట్టిన వాళ్లేనని సదరు వ్యక్తి వివరించాడు. చూడాలి మరి కెనడా ప్రధాని వీరిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa