ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త రేషన్ కార్డులకు రేపటి నుంచే దరఖాస్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 06:53 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కిలక ప్రకటన చేశారు. మే 7 నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డు విభజన, కొత్త సభ్యుల చేరిక, అడ్రస్ మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తామని, దీని ద్వారా రేషన్ వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డుల్లో మార్పుల కోసం 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారని మంత్రి వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మే నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. జూన్ నుంచి స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఇక ఈ కేవైసీ కారణంగానే కొత్త రేషన్ కార్డుల జారీలో ఆలస్యం జరిగిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం 95 శాతం మంది ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa