సాధారణంగా ఏ తల్లిదండ్రులు అయినా సరే తమ కుమార్తె అత్తారింట్లో బాగుండాలని.. వారికంటే ఆర్థికంగా బాగున్న కుటుంబానికి కోడలిగా పంపిస్తుంటారు. సోదరులు కూడా తమ తాహతుకు మించి కట్నకానుకలు ఇస్తుంటారు. అందరి చేత భేష్ అనిపించుకోవాలని కుటుంబ మొత్తం చాలా కష్టపడుతుంటారు. అచ్చంగా అలాగే చేసిందో కుటుంబం. కానీ వారిచ్చిన కట్నకానుకలు చూస్తే ఎవరికైనా సరే కళ్లు తిరగడం ఖాయం. ఎందుకంటారా.. ఒక పెట్రోల్ బంకు, కిలో బంగారం, 15 కిలోలో వెండి, 130 ఎకరాల భూమి, నాలుగు సూట్కేసుల నిండా రూ.1.51 కోట్ల నగదు, వాహనాలు, వస్త్రాలు వంటివి ఇచ్చి కుమార్తె సహా ఆమె అత్తింటి వాళ్లను ఆశ్చర్యానికి గురి చేశారు. మొత్తంగా రూ.21 కోట్ల కట్నం ఇచ్చి అతిథులనూ షాకయ్యేలా చేశారు.
రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా దేహ్ నివాసి జగ్వీర్ ఛబా, కమల దంపతుల కుమారుడు శ్రేయాన్స్ న్యాయవాదిగా పని చేస్తున్నాడు. అయితే ఇతడికి ఝడేలి గ్రామానికి చెందిన పొట్లియా కుటుంబానికి చెందిన ఓ అమ్మాయితో ఆదివారం రోజు వివాహం జరిగింది. అయితే అమ్మాయికి తల్లిదండ్రులతో పాటు నలుగురు సోదరులు కూడా ఉన్నారు. వారే భన్వర్ లాల్ పాట్లియా, రామచంద్ర పొట్లియా, సురేష్ పొట్లియా, డాక్టర్ కరణ్ పొట్లియాలు. వారంతా ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే తమ తాహుతుకు తగ్గట్లుగానే తన చెల్లెలికి ఘనంగా పెళ్లి చేశారు. వచ్చిన వారంతా షాకయ్యేలా, వరుడి తరఫు వారంతా మురిసిపోయాలే మర్యాదలు చేశారు. ముఖ్యంగా అనేక రకాల వంటకాలతో విందు భోజనం పెట్టి.. రిటర్న్ గిఫ్టులుగా వెండి నాణేలను అందజేశారు.
ఆపై కన్నీళ్లతో తమ సోదరిని అత్తారింటికి సాగనంపారు. సోమవారం రోజే మైరా కార్యక్రమం ఉండగా.. వరుడు తరఫు వాళ్లు వధువు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. రమ్మనగా.. సోమవారం రోజు ఉదయమే.. పొట్లియా కుటుంబానికి 600 నుంచి 700 మంది.. దాదాపు 100 వాహనాలు, 4 బస్సుల్లో నాగౌర్లోని వరుడి ఇంటికి వెళ్లారు. ఇంత పెద్ద మొత్తంగా వాహనాలు వెళ్లేసరికి వరుడి తరుఫు వారు సహా గ్రామంలోని ప్రజలంతా షాకయ్యారు. ఏదో రాజ కుటుంబానికి చెందిన అమ్మాయి వివాహం జరిగితే వచ్చినట్లుగా అనిపించగా.. అంతా వాకిళ్లలోనే నిలబడి చూశారు.
ఇలా వరుడి తరఫు వాళ్లు కూడా వారికి స్వాగతం పలకగా.. భారీ మొత్తంలో డబ్బు, నగలతో ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా 4 సూట్కేసుల నిండా రూ.21 కోట్ల 11 లక్షల నగదును తీసుకెళ్లి.. మైరా కార్యక్రమంలో చెల్లెలికి బహుమతిగా ఇచ్చారు. అలాగే కిలో బంగారం, 15 కిలోల వెండి, ఓ పెట్రోల్ బంక్, 130 ఎకరాల భూమి (210 బిగాల భూమి), లగ్జరీ కార్లు, అనేక రకాల పట్టుబట్టలు పెట్టారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి.. వధువు పుట్టింటి వాళ్లు పెడుతున్న బహుమతులను మైకులో చెప్పగా.. అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ఓ అమ్మాయికి కట్న, కానుకలు లభించడం జిల్లాలోనే ఇదే మొదటి సారి కాగా.. అంతా అక్కడే ఉండి మైరాను తిలకించారు. కొందరు దీన్ని వీడియోగా కూడా తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. చూసిన వారంతా ముక్కున వేలేస్కుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa